గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస గెలుపు త‌థ్యం: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు పూర్ణచందర్ రావు, రమణ, నారాయణ, రామరాజు, రాధాకృష్ణ, వెంకటయ్య, చంద్రశేఖర్ లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి గాంధీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున తెరాస పార్టీకి స్పంద‌న లభిస్తుంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు త‌మ‌ను మ‌రోసారి ఆద‌రించేందుకు సిద్ధంగా ఉన్నార‌న్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థులు భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకుడు వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన నాయ‌కుల‌తో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
తెరాస‌లో చేరిన వారికి పార్టీ కండువాలు క‌ప్పుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here