టీఆర్ఎస్ పార్టీలోకి మక్త కాంగ్రెస్ నాయకుడు రాజేష్ గౌడ్

మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.రాజేష్ గౌడ్, గుండె గణేష్ ముదిరాజ్ లు పలువురు కార్యకర్తలతో కలసి టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మియాపూర్ డివిజన్ టిఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి, ఎంపి నామా నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ లు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన రాజేష్ గౌడ్ బృందానికి స్వాగతం పలుకుతున్న టిఆర్ఎస్ నాయకులు

ఈ సందర్భంగా రాజేష్ గౌడ్, గణేష్ ముదిరాజ్ లు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న జనాకర్షక పథకాలకు మెచ్చి టిఆర్ఎస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. మియాపూర్ డివిజన్ లో ఉప్పలపాటి శ్రీకాంత్ గెలుపు ఖాయమని, బాబీ మెజారిటీ కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్ధినిబోయిన పురుషోత్తం యాదవ్, మర్రపు గంగాధర్ రావు, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here