చందానగర్ బీజేపీ అభ్యర్థికి పెరుగుతున్న నేతల మద్దతు

టీఆరెస్ ఓటమితోనే తెలంగాణ అమరవీరులకు ఆత్మ శాంతి: రఘుమా రెడ్డి

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమితోనే తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కన్వీనర్ రఘుమా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక, ఓయూ నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి చందానగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డికి మద్దతు తెలిపారు.

బీజేపీ అభ్యర్థి సింధు రఘునాథ్ రెడ్డికి మద్దతు తెలుపుతున్న ఉద్యమకారుల జేఏసీ నాయకులు

ఈ సందర్భంగా రఘుమా రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ద్రోహం చేసిందని 1386 మంది తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు ఇస్తే 540 మందికి మాత్రమే గుర్తింపు మిగిలినవారి కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు. తెలంగాణ సాధనకు కృషి చేసిన ఉద్యమకారులకు ఏ రకంగా అవకాశాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి పేరిట తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలు టీఆరెస్ పార్టీకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఆతెలిపారు. సింధు రెడ్డి కి మద్దతు తెలిపిన వారిలో నేతలు మణిపాల్ రెడ్డి, రమేష్, నర్సింహా, బింగి రాములు తదితరులు ఉన్నారు.

బిజెపి కి మద్దతు తెలిపిన భవానిపురం వీకరసేక్షన్ కాలనీవాసులు…

పార్టీలో చేరిన భవానీపురం వీకర్ సెక్షన్ వాసులతో కసిరెడ్డి భాస్కర రెడ్డి

చందానగర్ డివిజన్ బిజెపి అభ్యర్థి సింధు రఘునాథ్ రెడ్డికి డివిజన్ పరిధిలోని భవానీపురం వీకరసేక్షన్ కాలనీ వాసులు మద్దతు తెలిపారు. మంగళవారం బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి సమక్షంలో దాదాపు 100 మంది నాయకులు పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి భాస్కర్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని అయన తెలిపారు.

చందానగర్ లో బీజేపీ కి మద్దతు తెలిపిన జనసేన…

బీజేపీకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులతో కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బిజెపి కి మద్దతు తెలుపుతున్నట్లు జనసేన పార్టీ నాయకులు తెలిపారు, మంగళవారం చందానగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జనసేన శేరిలింగంపల్లి కో-ఆర్డినేటర్ రాజేష్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు బి.అరుణ్ కుమార్ లు తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి తప్పక విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ప్రతీ జనసేన సైనికుడు బీజేపీ గెలుపు కోసం పాటు పడాలని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కో-ఆర్డినేటర్ శ్రీదేవి, శ్రీనివాస్, దాసరి సోమేశ్వర్ రావు, దొరబాబు, యాదిరెడ్డి, సూర్య, సంతోష్, జోసెఫ్, రాజ గోపాల్, శ్రీహరి, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here