తెరాస ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ ప‌రిధిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌ని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు వెంకటాద్రి కాలనీ యూత్ సభ్యులకు శ‌నివారం ఆమె దరఖాస్తు ఫాంలను అందజేశారు.

ఫాం 18 ప‌త్రాల‌ను అంద‌జేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

ఈ సంద‌ర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ సభ్యులు పని చేయాలని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here