శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం శేరిలింగంపల్లి కన్వీనర్ జితేందర్ రెడ్డి, నాయకులు ప్రసాద్, ప్రశాంతి, రవి, దినేష్, రాజు, జగేష్ పాల్గొన్నారు.






