టీపీయూఎస్ఎస్ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ క‌న్వీన‌ర్‌గా కొంచె అశోక్ ముదిరాజ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణా ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వనర్‌గా కొంచె అశోక్ ముదిరాజ్ నియ‌మితుల‌య్యారు. సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు చిట్టా రెడ్డి ప్రసాద్, గ్రేటర్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చారి, జనరల్ సెక్రటరీ భరత్ రాజ్‌లు గురువారం అశోక్ ముదిరాజ్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సంద‌ర్భంగా అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రైవేట్ ఉద్యోగులంద‌రిని ఏక‌తాటిపైకి తీసుకువ‌స్తాన‌ని అన్నారు. అసంఘ‌టిత కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం సంఘం పెద్ద‌ల స‌హ‌కారంతో పోరాటం చేస్తామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి శ్రీను, మహిళా అధ్యక్షురాలు గాయత్రి, నాయ‌కులు రమణ యాదవ్, రాఘవేంద్ర, శివ యాదవ్, మదు, నివేదిత, రాజ్ శేఖర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

అశోక్ ముదిరాజ్‌కు నియామ‌క ప‌త్రం అంద‌జేస్తున్న చిట్టారెడ్డి ప్ర‌సాద్‌, ప్ర‌శాంత్ చారి, భ‌ర‌త్ రాజ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here