నమస్తే శేరిలింగంపల్లి: తొలగించిన అధ్యాపకులను, ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు పీఠం ప్రమోద్ కుమార్ డిమాండ్ చేశారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తొలగించిన జూనియర్, డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్ అధ్యాపకులను, స్కూల్ ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. జీవో నెంబర్ 45,46 ను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రైవేటు రంగంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల ఫోరమ్ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. ప్రైవేటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అశిల రామ్మోహన్, సెక్రెటరీ జనరల్ నాగరాజుచారి, నాయకులు వెంకటరమణ,సంతోష్ కుమార్, నాగరాజు,వెంకట ప్రమోద్, చంద్రశేఖర్, అశోక్ ,యుగేంధర్ శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.