పిడిశెట్టి రాజును సన్మానించిన కేశవరావు

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: మాజీ ప్రధాని దివంగత మహానేత నేత పీవీ నరసింహారావుకి భారత అత్యున్నత పురస్కరమైన “భారతరత్న” ఇవ్వాలని, వరంగల్ అర్బన్ జిల్లాకు పివి నామకరణం చేయాలని కోరుతూ గత రెండేళ్లు గా సైకిల్ యాత్ర చేస్తున్న సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజుని మంగ‌ళ‌వారం రాజ్యసభ సభ్యులు, పివి శతజయంతి ఉత్సవ కమిటి చైర్మన్ కె. కేశవరావు హైదరాబాద్ లోని వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన మహనీయులకు తగిన గుర్తింపు టీఆరెస్ పార్టీ ద్వారా నే వచ్చిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్ లోని పివి జ్ఞానభూమి లో ఘనంగా నిర్వహించడం జరిగిందని పివి పట్ల ప్రత్యేక గౌరవం సీఎం కేసీఆర్ కి ఉందని వారు పేర్కొన్నారు.

పిడిశెట్టి రాజును స‌న్మానిస్తున్న కే.కేశ‌వ‌రావు

గతంలో తాము తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా రెండేళ్లుగా సైకిల్ యాత్ర చేస్తూ ఆరువేల పైగా కిలోమీటర్లు పర్యటించి వారు చేపట్టిన సంస్కరణలు, జీవిత చరిత్రను ప్రజల‌కు వివరించడం జరిగిందని రాజు తెలియజేశారు. పివి స్థితప్రజ్ఞ తెలంగాణ ముద్దు బిడ్డ సునీత పరిశీలకులు అపర చానీఖ్యులు వివాద రహితుడు బహుభాషా కొవిధుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు కరీంనగర్ జిల్లా (పాత) బీమదేవరపల్లి మండల్ వంగర గ్రామపంచాయతీలో జన్మించి,మంథని నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఏమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవులను అలంకరించి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా,కేంద్రంలో అనే మంత్రి పదవులు అలంకరించి ఆ పదవులకె వన్నె తెచ్చి ప్రపంచ దేశాలకు భారతదేశ గొప్ప తనాన్ని చాటిచెప్పిన గొప్ప మహనీయులు పివి అని రాష్ట్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వాలని,వరంగల్ అర్బన్ జిల్లాకు పివి నామకరణం చెయ్యాలిని మరియు వంగర గ్రామానికి పోర్ లైన్ రోడ్లు వేయాలని, పర్యాటక కేంద్రంతో పాటు మండల కేంద్రంగా వంగరను చేసి భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని,గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎంపీ గారికి వినతిపత్రంలో పేర్కొన్నట్లు రాజు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here