శేరిలింగంపల్లి, మే 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ట, రేణుక ఎల్లమ్మ జమదగ్ని వివాహ మహోత్సవానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డినగర్ ప్రెసిడెంట్ బద్దం కొండల్ రెడ్డి, కుంచల రమేష్, ఆలయ కమిటీ ఛైర్మన్ యాదయ్య, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, వైస్ ఛైర్మన్ నర్సింహా, మల్లేష్, భిక్షపతి, నాగరాజు, పరశురామ్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.