అమ‌రుల త్యాగాల‌ను మ‌రిచిపోకూడ‌దు: కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, జూన్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింద‌ని అన్నారు. వారి బలిదానాలను మనం ఎన్నటికీ మర్చిపోకూడదు అని ఉద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి.హెచ్.ఎం.సి డిఈలు, ఏఈలు, జి.హెచ్.ఎం.సి సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here