శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్ ని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్ యాదవ్ ని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ వీర్ల శ్రీరామ్ యాదవ్ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మధ్యన వారధిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నందుకు ఆయనకు తెలంగాణ రాష్ట్ర బిసి ఐక్యవేదిక తరపున సన్మానం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్ట్ లు సామాన్య ప్రజల ఎన్నో రకాల ఇబ్బందులు ఆర్థిక, విద్యాపరంగా, వైద్య పరంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుతనాన్ని పార ద్రోలి సమాజాభివృద్ధికి పాటుపడుతున్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించి వారికి సంక్షేమ పథకాలు అందించేలా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. జర్నలిస్టులకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఇవ్వకపోతే తగిన గుణపాఠం తప్పదని ప్రభుత్వాలు చొరవచూపి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా జర్నలిస్టులు నిలుస్తారని కొనియాడారు. జర్నలిస్టులు సమాజాభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు రాయుడు, భీమ్రావు నాయక్, నాయి బ్రాహ్మణ సంఘం కృష్ణ, రజక సంఘం రమేష్, శాలివాహన కిషోర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.