శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన అభివృద్ధి కమిటీ ఏర్పాటు

శేరిలింగంప‌ల్లి, మే 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూక‌ట్‌ప‌ల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార‌ కార్యక్రమంలో కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీకి గాను 14 మంది సభ్యులను నూత‌నంగా ఎన్నుకున్నారు. అనంత‌రం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ సునీత మహేందర్ రెడ్డి, కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బండి రమేష్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కూకట్‌ప‌ల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, గొట్టిముక్కల దేశాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్, ఉప్పల ఏకాంత్ గౌడ్, భాషిపాక యాదగిరి, ఆలయ ఈఓ ఆంజనేయులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నరు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here