శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ టెంపుల్ రోడ్ నుండి టాకీ టౌన్ వరకు పొంగిపొర్లుతున్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నాయకుడు పల్లె మురళి ఆధ్వర్యంలో పలువురు స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మురుగు నీటి సమస్య పరిష్కరించాలని మయూరి నగర్ జల మండలి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ మియాపూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుండి టాకీ టౌన్ వరకు ఉన్న ప్రధాన రోడ్డులో గత 15 రోజుల నుండి డ్రైనేజ్ పొంగిపొర్లుతోంది. తద్వారా గ్రామ వాసుల సెల్లార్లలకు డ్రైనేజ్ నీళ్లు చేరి విలువైన వాహనాలు పాడైపోయాయి. దుర్వాసనతో స్థానిక ప్రజలు అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నారు. అనాదిగా పూజిస్తున్న గ్రామ దేవత ఆలయంలో మురుగునీరు వెళ్లి నిలవడంతో గ్రామస్తులు ఆగ్రహానికి లోనవుతున్నారు. కనుక వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని, లేకపోతే జలమండలి ఆఫీసు ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించినట్లు తెలిపారు. దీనికి గాను అధికారులు సానుకూలంగా స్పందించారని సమస్యను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండ్ర వేణు, మన్నె నరేందర్ , పల్లె మురళి, మన్నె అశోక్, గోల్కొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.