శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా కార్యక్రమంలో భాగంగా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ ద్వారా ఉచితంగా 200 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాస రావు, మంజుల రఘునాథ్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి 200 మంది లబ్దిదారులకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసా పథకం కింద మైనార్టీ మహిళలకు ఉచితంగా 200 మందికి కుట్టు మిషన్లు అందచేయడం చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. పేద మహిళల జీవితాలలో వెలుగులు నింపిన రోజు అని, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. మహిళలు తమ సొంత కాళ్ళ పై నిలబడి కుటుంబ పోషణ కు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని , ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుటుంన్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ వెల్ఫేర్ రీజినల్ ఆఫీసర్ కులకర్ణి, AGM పాసరి, షాజియా బేగం, నజియా బేగం, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు , మహిళలు పాల్గొన్నారు.