మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి, మే 20 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ఇందిరమ్మ మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసాలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పీఎసీ ఛైర్మెన్ ఆరెక‌పూడి గాంధీతో కలిసి మైనారిటీ మహిళలకు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కుట్టు మెషిన్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రాగం నాగేంద‌ర్ యాద‌వ్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఇంట్లోనే మైనారిటీ మహిళలకు ఉపాధి కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పద్మారావు, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here