శిల్పారామంలో అల‌రించిన న‌త్య ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 28 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, ఇత‌ర‌ చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. దుర్గ మైత్రయి శిష్య బృందం వీణ వాదన ఎంతగానో అలరించింది. ఢిల్లీ నుండి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువు సీతనాగ జ్యోతి, నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన ఎంతగానో అలరించింది. సౌత్ జోన్ కల్చరల్ స్త్రే తంజావూర్ సంయుక్త నిర్వహణలో శశాంక్ శంకర్ బృందం సంబల్ పూరి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళాకారులతోపాటు సందర్శకులు కూడా డప్పు చప్పుళ్లకు నాట్యం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here