శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని చైత్యన్య నగర్, సుమిత్ర నగర్ లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి వార్షికోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయినేని చంద్రకాంత్ రావు, ఆలయ కమిటీ మెంబర్స్ నర్సయ్య, బాలరాజు, నర్సింహ చారి, కృష్ణం రాజు, యాదగిరి, వేణు , సత్యనారాయణ, ఉమాపతి, అనిల్ కుమార్, మల్లేష్, నవీన్ చారి, బాలకృష్ణ, అనిల్ కుమార్, రమేష్, శ్యామ్, లక్ష్మణ్, నరేందర్, ప్రభు, శ్రీహరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.