తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ

హైద‌రాబాద్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ నరసింహారెడ్డి, పగడాల వేణు, రవి కిరణ్, కనపర్తి సతీష్, మహిళ వింగ్ అధ్య‌క్షురాలు స్వ‌ప్న రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల‌పై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలియజేశారు.

తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీని ఆవిష్క‌రిస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here