శాంతినగర్ లో టీ టైం షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: యువత స్వయం ఉపాధి దిశగా ముందుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శాంతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టీ టైం షాపును స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి తో‌ కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. యువత తమకు ఇష్టమైన రంగాలను ఎంచుకుని స్వయం ఉపాధిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సయ్యద్ పహీం, టీఆర్ఎస్ మిద్దెల మల్లారెడ్డి, అక్బర్ ఖాన్, నరేందర్ బల్ల తదితరులు పాల్గొన్నారు.

శాంతినగర్ లో టీ టైం షాపును ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here