ఎస్‌వీ ఫౌండేష‌న్ సేవ‌ల‌కు ప‌దేళ్లు… ఘ‌నంగా వార్షికోత్స‌వ వేడుక‌లు…

నమస్తే శేరిలింగంపల్లి: ఎస్‌వీ ఫౌండేష‌న్ స్వచ్ఛంద సేవా సంస్థ అవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక సేవలో పదేళ్ల పయనం పేరుతో పది సంవత్సరాల కాలం ఎస్‌వీ ఫౌండేష‌న్, యంయస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు, పట్టభద్రుల జేఎసీ రాష్ట్ర సలహాదారులు గొట్టిముక్కల పాండు రంగారావు, టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఛైర్ పర్సన్ గుడ్ల ధనలక్ష్మి, తెల్లాపూర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు, శిష్ట కరణం జాతీయ ఓబీసీ కన్వీనర్ డివీ కృష్ణారావు, పటాన్ చెరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ, అమీన్ పూర్ మునిసిపల్ కౌన్సిలర్ యడ్ల రమేష్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, డబ్ల్యూ హెచ్ డబ్ల్యూ ఓ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కోరంపల్లి కోటేశ్వరరావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, టీయూడబ్ల్యుజే నాయకులు, సీనియర్ జర్నలిస్టులు పులి అమృత్ గౌడ్, ఫైళ్లవిఠల్ రెడ్డి, గంట్లరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్ వి ఫౌండేషన్ ‌పదేళ్ల సేవా వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here