సీపీఐ మండల కార్యదర్శి కనకమామిడి‌ శ్రీశైలం గౌడ్ ను సస్పెండ్ చేసిన జిల్లా కార్యవర్గం

నమస్తే శేరిలింగంపల్లి: సీపీఐ శేరిలింగంపల్లి మండల పార్టీ కార్యదర్శి,‌ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న కనకమామిడి శ్రీశైలం గౌడ్ పార్టీకి వ్యతిరేక‌ కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రంగారెడ్డి జిల్లా‌ కార్యవర్గ సమావేశాన్ని గురువారం కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్ లో నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో సీపీఐ జిల్లాకార్యవర్గ సభ్యులు, మండల పార్టీ కార్యదర్శి కనకమామిడి‌ శ్రీశైలం గౌడ్ వ్యవహారశైలిపై ప్రత్యేకంగ చర్చించారు. శేరిలింగంపల్లి మండలంలోని ప్రేమ్ నగర్ లో గల 300 చదరపు గజాల స్థలం పార్టీ కార్యాలయాన్ని తన భార్య పేరుతో తప్పుడు పత్రాలను సృష్టించడం, మార్తాండ‌నగర్ లోని‌ 150 గజాల కార్యాలయం స్థలానికి శ్రీశైలం గౌడ్ పేరుతో కరెంటు మీటర్ బిగించి తన ఆస్తులంటూ కబ్జా చేసి సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని తమ దృష్టికి వచ్చినట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. పార్టీ నియమనిబంధనలకు‌ విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల‌ కింద శ్రీశైలం గౌడ్ ను పార్టీ నుంచి తప్పిస్తున్నట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం గౌడ్ కు నేటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి, శేరిలింగంపల్లి మండల సహాయ కార్యదర్శి టి. రామకృష్ణ, జిల్లా సమితి సభ్యులు కన్యగారి నర్సింహా రెడ్డి, కె. చందు యాదవ్, మండల కార్యవర్గ సభ్యులు లింగయ్య, టి.‌కృష్ణ, నాయకులు రక్తపు వినయ్ నాగేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

సమావేశంలో పాల్గొన్న సిపిఐ జిల్లా నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here