విద్యార్థులు క‌ష్ట‌ప‌డి చ‌ద‌వాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సమాజంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కానీ ఉదార భావంతో సేవ చేయాలనే సదుద్దేశంతో వారు సంపాదించే సంపాదనలో 5% శాతం సమాజ సేవకు ఖర్చు చేస్తే మన దేశం ,రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రటరీ రవికుమార్ యాదవ్ అన్నారు. స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం లో భాగంగా మియాపూర్ డివిజన్ లోని మక్తా మ‌హ‌బూబ్ పేట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వం పెంపొందించుకొని , క్రమశిక్షణ ,పట్టుదలతో త‌మ ట్రస్టు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను సద్వినియోగపరచుకున్నట్లయితే పదవ తరగతిలో మంచి మార్కులు సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగుల గౌడ్, మాణిక్ రావు, రాజేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్,రామకృష్ణారెడ్డి ,కిరణ్, రాము, సురేష్ , మల్లేష్ రవికాంత్ ,మాన్యం ,పవన్ యాదవ్,ముఖేష్ గౌడ్, అభిషేక్ పాల్గొన్నారు.

స్ట‌డీ మెటీరియ‌ల్‌ను పంపిణీ చేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here