శేరిలింగంపల్లి, మే 15 (నమస్తే శేరిలింగంపల్లి): అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, సామాజిక సేవకురాలు అమల అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఐ సెంటర్లో కాటరాక్ట్, రెటినా, రిఫ్రాక్టివ్, కార్నియా, న్యూరో-ఆఫ్తాల్మాలజీ సేవలను ఒకే చోట అత్యాధునిక సాంకేతికతతో అందుబాటులోకి తీసుకువచ్చారు. అనుభవజ్ఞులైన నేత్ర వైద్య నిపుణుల బృందం ద్వారా ప్రపంచ స్థాయి నిర్ధారణ, చికిత్స, శస్త్రచికిత్స సేవలను ఈ కేంద్రం అందించనుంది. ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక కంటి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నాన్ని అభినందించారు. కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం, సమయానికి చికిత్స పొందడం ద్వారా దృష్టి కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. జ్యోత్స్నా మైనేని (సీనియర్ కన్సల్టెంట్ – రెటినా & యువియాటిస్), డా. హరినాథ్ బాబు కార్లపూడి (కన్సల్టెంట్ ఆఫ్తాల్మాలజిస్ట్), డా. కోటేశ్వర ప్రసాద్ వీరగంధం (సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్), డా. రామకృష్ణ రావూరి (హెడ్ – అనస్తీషియాలజీ విభాగం), మహేష్ డెగ్లూర్కర్ (చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్), డా. జానకిరామ్ (రీజినల్ డైరెక్టర్), శ్రీకాంత్ (సెంటర్ హెడ్) పాల్గొన్నారు.





