శేరిలింగంపల్లి, మే 16 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల ప్రయోజనం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ నివాసి అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి బాధితులకి మంజూరు అయిన రూ1.50 లక్షల విలువ గల ఎల్వోసీ పత్రాలను నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితుడికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నిలుస్తుందని వివిధ వ్యాధులతో బాధపడుతున్న పేదలకు వైద్య సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం CMRF కింద ఆర్థిక సహాయం అందిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో పేదల ప్రయోజనం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు సయ్యన్న, బిసి నాయకులు రాంచందర్ యాదవ్, మల్లేష్, రెహ్మాన్, సుధాకర్, యాదయ్య, కోటేశ్వర రావు, లక్ష్మణ్, రామ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.