శేరిలింగంపల్లి, మే 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 43 మంది లబ్ధిదారులకు CMRF ద్వారా మంజూరైన రూ.20,47,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి , నాయి నేని చంద్రకాంత్ రావు, సాంబశివరావు, మంత్రిప్రగడ సత్యనారాయణ, పోతుల రాజేందర్, MD ఇబ్రహీం, కావూరి అనిల్, నాగేశ్వరరావు, మోజేశ్, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.