నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామని చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో రూ. 30 లక్షల రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను కాలనీవాసులు, అధికారులతో కలిసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు జైకృష్ణ, శ్రీనివాసరావు, మల్లికార్జున్ రాజు, కృష్ణ, ప్రసాద్ రాజు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
