క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడుతాయి – చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో తోడ్పడుతాయని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ స్పోర్ట్స్ క్లబ్ ఇంటర్నల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ ను కాలనీ అధ్యక్షుడు ఆర్.ఓంప్రకాష్ గౌడ్, కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, జగదీష్, శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ‌ టోర్నమెంట్ లో అన్ని వయస్కుల వారు పాల్గొని తమ ప్రతిభను‌ కనబరిచారు. 40 ఏళ్ల వయస్సుకు దిగువన, 41 ఏళ్ల నుంచి 51 ఏళ్ల వయస్సు గల వారిని, 56 ఏళ్ల వయస్సు పై బడిన వారిగా మూడు కేటగిరీలుగా విభజించారు. టోర్నమెంట్ ‌లో విజేతలుగా ‌నిలిచిన వారికి స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. దీప్తిశ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ భారత్ తరఫున థామోస్ కప్‌లో బంగారు పతకం సాధించినందుకు విష్ణువర్ధన్ గౌడ్ పంజాలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సుంకర సత్యనారాయణ, వై సీతారామయ్య, రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

దీప్తి శ్రీ టోర్నమెంట్ క్లబ్ లో మాట్లాడుతున్న చందానగర్ ‌కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here