హర్ ఘర్ తిరంగాతో దేశభక్తిని చాటుదాం – చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య ‌దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అమోఘమని, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిలో దేశ భక్తి మరింత పెరిగిందని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం ద్వారా చందానగర్ డివిజన్ లో వేముకుంట, గౌతమి నగర్, జవహర్ కాలనీ తదితర కాలనీలలో నవత రెడ్డి ఇంటి ఇంటికి జాతీయ జెండాలను అందజేశారు. మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి పై జాతీయ పతాకాన్ని ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకుందాం అన్నారు. కార్యక్రమంలో శోభ దుబే, గౌస్, పోచయ్య, షైఫుల్లహ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ డివిజన్ పరిధిలో ఇంటింటికి‌ జాతీయ జెండాలను అందజేస్తున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here