శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప్రియాంక ఆల‌(ఐఏఎస్‌)…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జీహెచ్ఎంసీ శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప్రియాంక ఆల‌(ఐఏఎస్‌) నియ‌మితుల‌య్యారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా భాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్న‌ప్రియాంక‌ను శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. కాగా ఇక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న ర‌వికిర‌ణ్ ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్లారు. బుద‌వారం మ‌ధ్యాహ్నం ప్రియాంక ఆల శేరిలింగంప‌ల్లి జ‌డ్సీగా భాద్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రియాంక ఆల గ‌తంలో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌హించి జీహెచ్ఎంసీకి అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా వ‌చ్చారు.

శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప్రియాంక ఆల‌(ఐఏఎస్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here