శేరిలింగంప‌ల్లి, చందాన‌గ‌ర్‌ జంట స‌ర్కిళ్ల‌లో 24511 మంది ప‌ట్ట‌భ‌ద్రులు.. 33 పోలింగ్ స్టేష‌న్లు..

  • ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం… ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన బ‌ల్దియా, పోలీసు అధికారులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి, చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్త‌యిన‌ట్టు ఉప‌క‌మిష‌న‌ర్లు తేజావ‌త్ వెంక‌న్న‌, సుధాంశ్ నంద‌గిరిలు తెలిపారు. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లో మ‌హిళ‌లు3409, పురుషులు 5302, ట్రాన్స్‌‌జెండ‌ర్లు ఇద్ద‌రితో క‌లిపి మొత్తం 8713 మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఉండ‌గా మొత్తం 12 పోలీంగ్ కేంద్రాలు సిద్ధం చేసిన‌ట్టు డీసీ వెంక‌న్న తెలిపారు. అదేవిధంగా చందాన‌‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో మ‌హిళ‌లు 6023, పురుషులు 9772, ట్రాన్స్‌జెండ‌ర్లు ముగ్గురితో క‌లిపి మొత్తం 15798 మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఉండ‌గా మొత్తం 21 పోలింగ్ కేంద్రాల‌ను సిద్ధం చేసిన‌ట్టు డీసీ సుధాంషు తెలిపారు.

పోలింగ్ స్టేష‌న్ల‌ను ప‌రిశీలిస్తున్న డీసీ సుధాంషు నంద‌గిరి, డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేశ్‌

ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌కు ఒక బూత్ లెవ‌ర్ ఆఫీస‌ర్‌ను సిద్ధంగా ఉంచామ‌ని, ఓట‌ర్లు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా వారు ప‌ర్య‌వేక్షిస్తారు డీసీలు తెలిపారు. ఈ క్రంమ‌లోనే చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలోని పోలింగ్ కేంద్రాల‌ను మాదాపూర్‌ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు, మియాపూర్ ఏసీపీ కృష్ణ‌ప్ర‌సాద్‌, మియాపూర్‌, చందాన‌గ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్లు సామ‌ల వెంక‌టేశ్‌, క్యాస్ట్రోలు ప‌రిశీలించారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here