నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్లోని వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆంఫి థియేటర్ లో శనివారం నృత్యప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నృత్య కళాకారులు ఆయతి, వాన్యా, రీతుల్, శ్రియ, శ్రీకరీ, జ్యోషితలు శివ స్తుతి , అలరిపు, తిల్లాన గీతాలకు అనుగుణంగా భరతనాట్యంతో నాట్య గురువు కౌశిక్ దాస్ నేతృత్వంలో కళాకారులు మౌక్తిక, రితిక, అనన్యలు శివ తాండవ, తరణ, ఫ్యూషన్ అంశాలతో కథక్ నృత్య ప్రదర్శనలతో చూపరులను విశేషంగా ఆకట్టుకున్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన నృత్య ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళాకారులను అభినందించారు.
