శేరిలింగంపల్లి బిజెపి టిక్కెట్ ఇవ్వండి: అందెల కుమార్ యాదవ్

  • కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, మంత్రి శ్రీనివాసులకు వినతి
కిషన్ రెడ్డికి బయోడేటాను అందజేస్తున్న అందెల కుమార్ యాదవ్

శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకుడు అందెల కుమార్ యాదవ్ మంగళవారం కేంద్ర మంత్రి, బిజెపి గ్రేటర్ ఎన్నికల కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి, కన్వీనర్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అదేవిధంగా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్ లను మర్యాదపూర్వకంగా కలిశారు. శేరిలింగంపల్లి డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటిచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ వారికి బయోడేటాలు అందజేశారు. తన అభ్యర్థన పట్ల పార్టీ అధినాయకత్వం సానుకూలంగా స్పందించిందని కుమార్ యాదవ్ తెలిపారు.

డాక్టర్ లక్ష్మణ్ తో అందెల కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here