నమస్తే శేరిలింగంపల్లి: కరోన మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని మాదాపూర్ శిల్పరామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిల్పారామం సందర్శన ప్రతిరోజు యదావిధిగా కొనసాగుతుందని, శిల్పరామంలో ఉన్న దుఖాణాలలో క్రయ విక్రయాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని తెలిపారు. కరోన కట్టిడికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు పాటిస్తూ శిల్పారామంలో సందడి చేయవచ్చని సందర్శకులకు సూచించారు.