హోలిక మాదిరిగా కరోన నుంచి ప్రజలంతా విముక్తి పొందాలి: చింతకింది గోవర్ధన్ గౌడ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: బిజెపి రంగారెడ్డి అర్భన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి హోలి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క‌రోన మ‌ళ్లీ విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కుటుంబ సభ్యులతోనే పండుగ జరుపుకున్నట్టు తెలిపారు. హోలిక దహనం తర్వాత నాటి ప్రజలంత సుఖసంతోషాలతో జీవించినట్టు ఈ హోలి తర్వాత కరోనాతో విముక్తి కలిగి ప్రజలంతా ప్రశాంత జీవితాన్ని గడపాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు చింతకింది గోవర్ధన్ గౌడ్ తెలిపారు.

కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకుంటున్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here