శిల్పారామం “స‌మంత” కార్య‌క్ర‌మంలో సంద‌డి చేసిన‌ లింగ‌మార్పిడి క‌ళాకారులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శిల్పారామంలో క్వీర్ క‌మ్యూనిటీ ప్ర‌ద‌ర్శ‌న‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) ఆద్వ‌ర్యంలో శిల్పారామంలో ‘సమంత’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. లింగమార్పిడి, క్వీర్ ఆర్టిస్టులు కలిసి తమ కళను ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా విభజించారు, మొదట‌గా లింగమార్పిడి వ్యక్తులలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై డాక్టర్ రిధిమా బిండ్లిష్ అవగాహన క‌ల్పించారు. తర్వాత‌ క్వీర్ కమ్యూనిటీ స‌భ్యులు, విదేశీ విద్యార్థలు ప్రత్యేకమైన చేనేత ఉపకరణాలతో రాంప్ వాక్ చేశారు. ప్రముఖ చేనేత ప్రోత్సహకురాలు సుధారాణి చేనేత హస్త కళ‌ ఉత్పత్తులను వారికి అంద‌జేశారు. సాయంత్రం ఆంఫి థియేటర్‌లో పా త్రుని చిదానంద శాస్త్రీ, చంద్రముఖి మువ్వల, వైభవ్ కుమార్ మోడీలు త‌మ భర‌త నాట్య ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్షకుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నారు.

వివిధ వేష‌ధార‌ణ‌ల‌తో ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్న‌ క్వీర్ క‌మ్యూనిటీ, లింగ‌మార్పిడి క‌ళాకారులు
భ‌ర‌త‌నాట్యంతో ఆక‌ట్టుకుంటున్న ప్రముఖ క‌ళాకారుడు చిదంబర శాస్త్రీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here