నమస్తే శేరిలింగంపల్లి: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో తెలంగాణ జాగృతి, ఎంపీ రంజిత్ అన్న యువసేన ఆద్వర్యంలో శనివారం పండ్లను చేశారు. ప్రముఖ జోతిష్యులు విశ్వనాథుల చంద్రశేఖర శాస్త్రీ ముఖ్య అతిథిగా హాజరై రోగులకు పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తారని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి నితీష్, ఎంపీ రంజిత్ అన్న యువసేన అధ్యక్షులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిల శివ, జాగృతి నాయకులు శశిధర్, సాయి, కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
