స్వ‌యం స‌హాయ‌క బృంద మ‌హిళ‌లు ప్ర‌త్యేక వ్యాక్సినేషన్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి: మంజుల ర‌ఘునాథ్‌రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని అంబెద్క‌ర్‌ మున్సిపల్ కళ్యాణ మండపంలో స్వయం సహాయక మహిళ సంఘాల వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక‌ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వాక్సిన్‌పై మహిళలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. డివిజన్ లోనీ అన్ని మహిళ సంఘాలకు అపోహలు తోలగించి వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కరోనా మహ్మమరి నియంత్రణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తి చేందకుండా ప్రభుత్వం కోన్ని రంగాల ప్రజలకు ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని స్వ‌యం స‌హాయ‌క బృంద మ‌హిళ‌లు ఈ వాక్సినేషన్ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, చందానగర్ స‌ర్కిల్‌ ప్రాజెక్టు అధికారి వత్సాలాదేవి గారు, చందానగర్ లయన్స్ క్లబ్ ప్రసిడెంట్ పులిపాటి నాగరాజు, నాయకులు రవిందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ మున్సిప‌ల్ క‌ల్యాణ మండ‌పంలో వ్యాక్సినేష‌న్‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here