నమస్తే శేరిలింగంపల్లి: ఆషాడ బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని శాంతినగర్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘటం ఊరేగింపు డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలతో అంగరంగవైభవంగా నిర్వహించారు. అమ్మవారికి బోనాలు, ఘటం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, సుధాకర్, తాయప్ప, మల్లేష్, కొండల్, సతీష్ ముదిరాజ్, వెంకటేష్, కాశి కుమార్, యాదగిరి, కృష్ణ ముదిరాజ్, పవన్, వొయిలప్ప, అంజయ్య, యువకులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220725-WA0003.jpg)