బీజేపీ స‌భ్య‌త్వ న‌మోదులో శేరిలింగంప‌ల్లి ముందుండాలి.. ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద బీజేవైఎం నాయకుడు ఫిరంగి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని స్థానికులకు సభ్యత్వాలు చేయించి నియోజవర్గ ముఖ్య నాయకులు విధిగా 500కు మించకుండా సభ్యత్వ నమోదు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం నమోదు కార్యక్రమంలో ముందు వరుసలో ఉంచాలని కోరారు. నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి రోజురోజుకీ ఆదరణ పెరిగి స్వచ్ఛందంగా ప్రజలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని రవి కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శాంతి భూషణ్ రెడ్డి, రాజు, సుధాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ర‌వికుమార్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here