శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్నందించే దిశగా పనులు చేపడుతున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని శిల్పావ్యాలీలో రూ. 1 కోటి 60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే (300mm DIA RCC NP3 CLASS SEWER LINE) డ్రైనేజీ పనులను శేరిలింగంపల్లి శాసనసభ్యుడు, పీఎసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో డ్రైనేజీ సమస్యలు పునరావృతమవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించి నూతన యూజీడీ లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, HMWSSB DGM, MANAGER, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సత్యనారాయణ, శిల్పా వ్యాలీ మేనేజంగ్ కమిటీ ప్రెసిడెంట్ సిధార్థ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ స్వాతి రెడ్డి, సెక్రటరీ భవాని, జాయింట్ సెక్రటరీ శివ రెడ్డి, ట్రెజరర్ విజయ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పద్మావతి, రమాకాంత్, సూర్యనారాయణ, గోవర్ధన్ రెడ్డి, అంకమ్మ చౌదరి, శ్రీకర్ రెడ్డి, శివ, విష్ణువర్ధన్, చిరంజీవి, సెంట్రల్ పార్క్ ఫేస్- 2 జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, స్ప్రింగ్ వ్యాలీ ప్రెసిడెంట్ సాయి, కృష్ణ మూర్తి, మల్లేష్ యాదవ్, శశాంక్ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.