టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు తరలివెళ్లిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు

శేరిలింగంప‌ల్లి, మే 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాదులోని జలవిహార్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) 25 వసంతాల సంబురాల కార్యక్రమానికి శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. చందానగర్ పీజేఆర్ స్టేడియంలో పోస్టర్ ను విడుదల చేసి అనంతరం వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు పైళ్ల విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ మాట్లాడుతూ 2001లో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. తెలంగాణ కోసం కొట్లాడి రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలువురు జర్నలిస్టులు ఆత్మ బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ దమనకాండపై తమ కలాలతో ఎండగట్టారని తెలిపారు.

జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపిన పాలకులపై తిరుగుబాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం పోరాడుతున్న టీజేఎఫ్ ప్రస్థానం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సలహాదారు పులి అమృత్ గౌడ్, సీనియర్ జర్నలిస్టులు కె.శ్రీనివాస్ గౌడ్, అశోక్ యాదవ్, టెంజు సలహాదారు జి.రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, టెంజు శేరిలింగంపల్లి ప్రధాన కార్యదర్శి కె.కిషోర్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టు నాయకులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here