శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కాలేశ్వరం కమిషన్ ముందు తన అభిప్రాయం వివరించడానికి వచ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కి సంఘీభావంగా ట్యాంక్ బండ్ వద్ద గల బి ఆర్ కే భవన్ కు శేరిలింగంపల్లి బి.ఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు. కాళేశ్వరం కమిషన్ కార్యాలయం వద్ద బిఆర్ఎస్ శ్రేణులు శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్, మిద్దెల మల్లారెడ్డి అద్వర్యంలో కెసిఆర్ కి మద్దతుగా వేలాది మంది శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలలో అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ను నెంబర్ వన్ గా నిలబెట్టిన మహా నాయకుడు కేసీఆర్ అని, అలాంటి నేతను లక్ష కోట్లు అవినీతి జరిగిందని లేనిపోని మాటలు చెప్పి, దోషి గా నిలబెట్టి విచారణకు పిలవడం చాలా దారుణం అని అన్నారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా కెసిఆర్ కు ప్రజలు మద్దతు ఉన్న గొప్ప నాయకుడు అని, ఆయనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, బాబాయ్, శంకర్ నాయక్, సతీష్, రాజు ముదిరాజ్, అవినాష్ రెడ్డి, శ్రీనివాస్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.