శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంఘీభావంగా బీఆర్కే భవన్ వద్దకు గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్ చేరుకుని ధర్నా నిర్వహించారు. తెలంగాణ అంటే కేసీఆర్ అని, కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. తప్పుడు కేసులు పెట్టి కేసీఆర్ను ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదని అన్నారు.