శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారా నగర్ కాలనీ సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి BHEL చౌరస్తా గ్యాస్ గో డౌన్ నాలా వరకు నాలా విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను,RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం, నాలా విస్తరణ నిర్మాణం పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, SNDP విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని అన్నారు. ఒకప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇబ్బందులకు గురయ్యేవారని, కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, నాలాల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని అన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని , నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని , యుద్ధప్రాతిపదికన పనులుప్రారంభించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో SNDP అధికారులు AE నిఖిల , యుగేందర్, పవన్, టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ సిటీ ప్లానర్ తులసిరామ్, TPS జిషన్, TPS సంతోష్, నాయకులు , కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.