శేరిలింగంపల్లి, ఆగస్టు 7 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని బంజారాహిల్స్లో ఉన్న నంది నగర్ లోని మాజీ మంత్రి కేటీఆర్ నివాసంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహించిన శేరిలింగంపల్లి ముఖ్య నాయకుల సమావేశంలో కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావుతో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కృషి చేయాలని ఈ సమావేశం ద్వారా కేటీఆర్ పిలుపునిచ్చారు.






