శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మాదాపూర్ పత్రికా నగర్లో అక్రమంగా తరలిస్తున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్లను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 31 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా స్వాధీనం చేసుకున్న సిలిండర్లను సివిల్ సప్లైస్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.






