శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 106 డివిజన్ లోని గోపి నగర్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం పాఠశాల ఆవరణలో కావలసిన ప్రాథమిక మరమ్మత్తులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సామేల్ కార్తీక్, కాట నరసింహ గౌడ్, యువజన, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.






