సరస్వతి విద్యా మందిర్ లో బాలల దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి:చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవం ఘనంగా నిర్వచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మూల పురుషులు స్వర్గీయ కే వి రంగారెడ్డి కుమారుడు డాక్టర్ కొండా లక్ష్మారెడ్డి, కొండా లక్ష్మికాంత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పిల్లలకు అభినందనలు, ఆశీస్సులు అందించి బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మారెడ్డి, కొండా లక్ష్మికాంతారెడ్డి, పాఠశాల కార్యదర్శి రఘునందన్ రెడ్డి, సహ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సభ్యులు నాగభూషణరావు, సుదీప్ రెడ్డి, గాల్ రెడ్డి పాఠశాల పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here