దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా: గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో స్థానిక‌ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రంగనాథ్ స్వామి వారికి ప్రత్యేక ప్రభోదన ఏకాదశి అభిషేకం అష్టోత్తర, విష్ణు సహస్త్ర నామ పారాయణం నిర్వహిచారు. రంగనాథ స్వామి ఆలయానికి వెండి శఠరిని కృష్ణ మూర్తి ఉషాదేవి కుటుంబ సభ్యులు ఆదేశించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని రంగనాథ స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని, గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంజీరా డైమండ్ టవర్స్ రెసిడెంట్స్ కృష్ణమూర్తి, ఉషాదేవి, రాంప్రసాద్, చంద్రశేఖర్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, వేణు, రంగస్వామి, చిన్న, శంకర్ , సురేష్, క్రాంతి, మధు, పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here