శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ జిల్లా పరిషత్ హై స్కూల్ లో చెట్లు పెరిగి, చెత్త పేరుకుపోవడంతో జిహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు స్పందించిన జీహెచ్ఎంసీ వెంటనే కార్మికులను పంపించగా వారు స్కూల్ ఆవరణను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పవన్ కుమార్, రక్తపు జంగం గౌడ్, కొండాపూర్ డివిజన్ వార్డు కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.






